విజయవాడ: ఏపీ సీఎం జగన్కు ఢిల్లీలో ఎంపీకి ఇచ్చిన విలువ కూడా ఇవ్వడంలేదని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. రాష్ట్ర డిమాండ్లలో ఎన్నింటికి కేంద్రం అంగీకారం తెలిపిందో సీఎం వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. ఢిల్లీ పర్యటన వివరాలను గోప్యంగా ఉంచడం సబబుకాదన్నారు. ఢిల్లీలో జగన్ కేంద్రమంత్రి అమిత్ షాను కలిసిన వివరాలు ఎందుకు చెప్పడంలేదని ఆయన ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి సమావేశం విజయవంతమైందంటే.. మంచి భోజనాలు పెట్టి పంపించారా? అని ఎద్దేవా చేశారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఎలాంటి మోసం, ద్రోహం.. మోడీ ప్రభుత్వం చేస్తూ వచ్చిందో, ఇప్పుడు కూడా అదే జరుగుతోందని రామకృష్ణ అన్నారు. ఢిల్లీలో ఎంపీకి ఉన్న విలువ కూడా జగన్కు లేదని, ఎంపీని లోపలకు రమ్మని, సీఎంను బయట కూర్చోబెడుతున్నారని, ముఖ్యమంత్రి లోపలకు వెళ్లి వచ్చిన తర్వాత ఆయన ఏమీ మాట్లాడడంలేదన్నారు. జగన్ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఢిల్లీ పర్యటన వివరాలు చెప్పాలని రామకృష్ణ మరొకసారి డిమాండ్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm