హైదరాబాద్ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సౌదీ అరేబియాలో ఒకరోజు పర్యటన జరుపనున్నారు. ఈనెల 29న అక్కడ ప్రారంభం కానున్న ఫ్యూచర్ ఇన్వెస్ట్ మెంట్ ఇనీషియేటివ్ (ఎఫ్ఐఐ) వార్షిక సదస్సులో ప్రధాని పాల్గొననున్నారు. ఈ సదస్సు 29 నుంచి 31వరకు కొనసాగనుంది. ఈమేరకు అధికార వర్గాలు వివరాలను తెలిపాయి. ఈ పర్యటనలో ఇరుదేశాల నేతలు భేటీ కానున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ భారత్ సందర్శించిన సమయంలో పెట్రో కెమికల్స్, మౌలిక సదుపాయాలు, మైనింగ్ రంగాల్లో భారత్ లో వంద బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మోదీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
Mon Jan 19, 2015 06:51 pm