రాజమండ్రి: కచ్చులూరు వద్ద బోటు ప్రమాదంలో ఇంకా లభ్యం కాని ఐదు మృతదేహాలు కోసం గాలింపు కొనసాగిస్తామని రంపచోడవరం ఏఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు. బుధవారం ఆయన మాట్లాడుతూ బోటులో ఉన్న మృతదేహాలకు సంబంధించిన ఎముకలు సేకరించామని, ఎముకలను డీఎన్ఎ పరీక్షలకు పంపుతామన్నారు. ఎముకలకు డీఎన్ఎ చేసి మృతుల వివరాలు గుర్తించే అవకాశముందన్నారు. ఇంకా గుర్తించని రెండు మృతదేహాలను మరో రెండు రోజుల పాటు రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి మార్చురీలో భద్రం చేస్తామన్నారు. కుటుంబ సభ్యులు వచ్చి మృతదేహాలను గుర్తించాలని అందరికీ సమాచారం ఇచ్చినట్లు ఏఎస్పీ తెలిపారు. కాగా బోటు ప్రమాదం జరిగి 38 రోజుల అనంతరం నిన్న (మంగళవారం ) ధర్మాడి సత్యం బృందం రాయల్ విశిష్ట బోటును వెలకితీసిన విషయం తెలిసిందే. ఇన్ని రోజులుగా నీళ్లలో నానిపోయి ఉండటం వల్ల మృతదేహాలు గుర్తించలేని విధంగా ఉన్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm