ముంబై: టీం ఇండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అధ్యక్షుడిగా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అధ్యక్ష పదవితో పాటు.. సెక్రటరీ, ట్రెజరర్, వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీ పదవులను కూడా నేడు భర్తీ చేశారు. సెక్రటరీగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కుమారుడు జై షా, వైస్ ప్రెసిడెంట్గా మాహిమ్ వర్మ, ట్రెజరర్గా అరుణ్ సింగ్ ధుమాల్, జాయింట్ సెక్రటరీగా జయేష్ జార్జ్ బాధ్యతలు చేపట్టారు. వీరంతగా అధ్యక్షుడు గంగూలీతో కలిసి దిగిన ఫొటోని బీసీసీఐ ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా అభిమానులు.. ఈ కొత్త టీంకి అభినందనలు తెలుపుతూ కామెంట్ చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm