హైదరాబాద్ : ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరించే రియాల్టీ షో కౌన్ బనేగా కరోడ్పతి మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ షో ను రద్దు చేయాలంటూ నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం ప్రసారమైన ఎపిసోడ్లో 'వీరిలో ఏ భారతీయ పాలకుడు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుకు సమకాలికుడు?' అనే ప్రశ్నకు సమాధానాలుగా ఇచ్చిన ఆప్షన్స్లో మరాఠ యోధుడు ఛత్రపతి శివాజీ పేరును కేవలం 'శివాజీ' అని ఇవ్వడం వీక్షకులకు ఆగ్రహం తెప్పించింది. ఈ పొరపాటుకు సోనీ టీవీ క్షమాపణలు చెప్పినప్పటికీ 'చరిత్రలో విలన్లకు మర్యాదనిచ్చి, భారత యోధుడిని కేవలం 'శివాజీ' అని సంబోధించడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm