హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెలో భాగంగా జేఏసీ నిర్వహించతలపెట్టిన సడక్బంద్కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు తెలంగాణ జనసమితి పార్టీ అధినేత కోదండరాం అన్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డిని పరామర్శించిన అనంతరం కోదండరాం మాట్లాడారు. ముందస్తు అరెస్టులను ఖండిస్తున్నామన్నారు. అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి ఆరోగ్యం క్షీణిస్తోందన్నారు. బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నారన్నారు. అందరూ రేపటి సడక్బంద్ను విజయవంతం చేయాలన్నారు. ప్రభుత్వం కోర్టుకు తప్పుడు అఫిడవిట్లు సమర్పిస్తోందన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm