నర్సంపేట: అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న పేదలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిచ్చిందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వేర్వేరు గ్రామాలకు చెందిన 16మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి కింద రూ.5లక్షల విలువైన చెక్కులను సోమవారం ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm