న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. నేటి నుంచి డిసెంబర్ 13 వరకు సమావేశాలు జరగనున్నాయి. లోక్సభ సమావేశాలను స్పీకర్ ఓం బిర్లా ప్రారంభించగా.. రాజ్యసభను ఛైర్మన్ వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఆరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, రామ్ జఠ్మలానీ, జగన్నాథ్ మిశ్రా, సుఖ్దేవ్ సింగ్ లిబ్రా, గురుదాస్ గుప్తాలకు రాజ్యసభ నివాళులు అర్పించింది. ఆ తర్వాత పలువురు ఎంపీలు అరుణ్ జైట్లీతో తమ అనుభవాలను సభ్యులతో పంచుకున్నారు. అనంతరం ఛైర్మన్ మధ్యాహ్నం 2 వరకూ గంటలకు వాయిదా వేశారు.
Mon Jan 19, 2015 06:51 pm