కోల్కతా : పశ్చిమ బెంగాల్ నటి, టీఎంసీ ఎంపీ నుస్రత్ జహాన్ పార్లమెంట్ సమావేశాలకు హాజరు కాలేదు. అనారోగ్య కారణాలతో ఆదివారం రాత్రి ఆమె కోల్కతాలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ఎంపీ నుస్రత్ శ్వాసకోశ సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు ఆమె అధికార ప్రతినిధి అభిషేక్ మజుందార్ వెల్లడించారు. చికిత్స అనంతరం రేపు నుస్రత్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతారని ఆయన తెలిపారు. అధిక మోతాదులో మందులు వాడినందుకే నుస్రత్ అనారోగ్యానికి గురైనట్లు ఆమె కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm