పశ్చిమగోదావరి: ఉభయగోదావరి జిల్లాలో బైకులు దొంగతనానికి పాల్పడుతున్న మడగల విజయ్ కుమార్, సంభాని రమేష్లను నరసాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 11 బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో వీరిద్దరూ పలు జిల్లాలలో బైకుల దొంగతనాలకు పాల్పడ్డారని సీఐ కృష్ణ కుమార్ మీడియాకు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm