అమరావతి: విభజన చట్టంలోని అంశాలను కేంద్రం నెరవేర్చాలని సీపీఐ నేత రామకృష్ణ డిమాండ్ చేశారు. చంద్రబాబు ధర్మపోరాటం చేసినా మోడీ స్పందించలేదన్నారు. ఇపుడు జగన్ వేడుకున్నా కేంద్రంలో చలనం లేదన్నారు. పోలవరంపై రాష్ట్రం ఖర్చు చేసిన నిధులు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. పోలవరంపై కేంద్ర ప్రభుత్వం వైఖరి మార్చుకోవాలని సీపీఐ రామకృష్ణ సూచించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి విపక్షాలు సహరించడం లేదని.. విజయసాయిరెడ్డి మాట్లాడడం మంచి పద్ధతి కాదన్నారు. విజయసాయిరెడ్డికి ధైర్యం ఉంటే మోడీని నిలదీయాలన్నారు. ప్రభుత్వం మిషన్ బిల్డప్ పేరుతో ప్రభుత్వ స్థలాలు అమ్మితే ఊరుకోమన్నారు. గతంలో ఏ ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాల్పడలేదన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, స్పీకర్ దిగజారి మాట్లాడుతున్నారన్నారు. ఇటువంటి వ్యాఖ్యలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని సీపీఐ రామకృష్ణ పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm