ఢిల్లీ: చలో పార్లమెంట్ కార్యక్రమంలో భాగంగా జేఎన్యూ విద్యార్ధులు పార్లమెంట్ వైపు ర్యాలీ తీసిన విషయం తెలిసిందే. అయితే ర్యాలీకి అనుమతి లేదంటూ బేర్ సరాయి రోడ్డులో విద్యార్ధుల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, విద్యార్ధులకు మధ్య తోపులాట జరిగింది. తమ సమస్యలను తీర్చాలని పార్లమెంట్ లో ఎంపీలకు తెలియజేసేందుకే తాము ర్యాలీ చేపట్టినట్టు విద్యార్ధులు తెలిపారు. ర్యాలీ నేపథ్యంలో ఇప్పటికే జేఎన్యూ, పార్లమెంట్ పరిసరాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించిన విషయం తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm