న్యూఢిల్లీ: తెలుగు అకాడమీకి నిధులు కేటాయించాలని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. లోక్సభలో మాట్లాడిన ఆయన.. తెలుగును గొప్ప భాషగా అభివృద్ధి చేయాలనుకుంటున్నామని తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో తెలుగు అకాడమీని ఏర్పాటు చేయలేదని.. ఇప్పుడు తెలుగు అకాడమీ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. తెలుగు భాష అభ్యున్నతికి కేంద్రం సహకరించాలని కోరారు. పదో షెడ్యూల్లో తెలుగు అకాడమీ ఉందని.. కేంద్రం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm