హైదరాబాద్: రియల్మి తన నూతన స్మార్ట్ఫోన్ రియల్మి ఎక్స్2 ప్రొ ను నవంబర్ 20వ తేదీన భారత్లో విడుదల చేయనున్న విషయం విదితమే. కాగా ఈ ఫోన్కు గాను ఇవాళ్టి నుంచి రియల్మి వెబ్సైట్లో బ్లైండ్ ఆర్డర్ బుకింగ్స్ను ప్రారంభించారు. ఈ క్రమంలో ఈ ఫోన్ను అందరికన్నా ముందుగానే కొనుగోలు చేసే అవకాశాన్ని రియల్మి తన కస్టమర్లకు అందిస్తున్నది. ఇందులో భాగంగా వినియోగదారులు రూ.1వేయి చెల్లించి రియల్మి ఎక్స్2 ప్రొ ఫోన్ను బ్లైండ్ ఆర్డర్ చేయవచ్చు. ఈ క్రమంలో నవంబర్ 20న ఫోన్ లాంచ్ కాగానే ఆ రోజు లేదా ఆ మరుసటి రోజు (నవంబర్ 21)న మిగిలిన మొత్తాన్ని చెల్లించి వినియోగదారులు ఆ ఫోన్ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీంతో అందరికన్నా ముందుగానే ఈ ఫోన్ను వినియోగదారులు డెలివరీ తీసుకోవచ్చు.
Mon Jan 19, 2015 06:51 pm