న్యూఢిల్లీ: లోక్సభలో తొలిరోజే గందరగోళం నెలకొంది. ప్రశ్నోత్తరాలను అడ్డుకునేందుకు విపక్ష సభ్యుల యత్నించారు. పలు అంశాలపై చర్చకు విపక్షాల పట్టుబట్టాయి. అయితే ఈ గందరగోళం మధ్యనే ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ప్రాంతీయ భాషల పరిరక్షణపై లోక్సభలో టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రశ్న లేవనెత్తారు. సంస్కృతి, సంప్రదాయాలను రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ఏపీలో జగన్ ప్రభుత్వం పాఠశాలల్లో ఇంగ్లీష్ను తప్పనిసరి చేసిందన్నారు. త్రిభాషా విధానాన్ని అమలు చేయాలన్నారు. దీనిపై కేంద్రమంత్రి పోఖ్రియాల్ జవాబిస్తూ.. తెలుగు భాష ఉన్నతికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. హైదరాబాద్, బెనారస్ తదితర విశ్వవిద్యాలయాల్లో తెలుగు భాషా పీఠాల అభివృద్ధికి చర్యలు చేపట్టామన్నారు. భారతీయ భాషల పరిపుష్టి చేయడానికి కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు. దీనిలో భాగంగా శాస్త్రీయ అధ్యయన కేంద్రాన్ని నెల్లూరులో ఏర్పాటు చేశామని.. ఈ నెల 13న కార్యకలాపాలు ప్రారంభమయ్యాయన్నారు. 2011లో హైదరాబాద్ యూనివర్సిటీలో తెలుగు అధ్యయన కేంద్రాన్ని నెలకొల్పామని.. నిధులు కూడా మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm