ఢిల్లీ : జేఎన్యూ విద్యార్థుల డిమాండ్లపై చర్చలకు ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు మానవ వనరుల మంత్రిత్వ విద్యాశాఖ కార్యదర్శి సుబ్రహ్మణ్యం వెల్లడించారు. విద్యార్థులతో చర్చలు జరిపి శాంతియుతంగా సమస్యలు పరిష్కరించేందుకు కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. ముగ్గురు సభ్యుల ఉన్నత స్థాయి కమిటీని నియమించాం. వారిలో మాజీ యూజీసీ ఛైర్మన్ ప్రొ.వీఎస్ చౌహాన్, ఏఐసీటీఈ ఛైర్మన్ అనిల్ సహస్రబుద్దే, యూజీసీ కార్యదర్శి రజనీష్ జైన్లు ఉన్నారు. ఈ కమిటీకి కావల్సిన సహకారాన్ని యూజీసీ అందిస్తుంది అని తెలిపారు. మరోవైపు విద్యార్ధులు తలపెట్టిన పార్లమెంటు ముట్టడిని పోలీసులు అడ్డుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm