సిద్ధిపేట జిల్లా: సిద్దిపేటలోని కొండా భూదేవి గార్డెన్లో పట్టణ పేదరిక నిర్ములన సంస్థ ఆధ్వర్యంలో 30 కంపెనీల ప్రతినిధులు మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో యువతీయువకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉద్యోగం విషయంలో యువతీయువకులు సీరియస్గా ఉండాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. జీవితంలో ఏదయినా సాధించాలంటే లక్ష్యం ఉండాలన్నారు. ఉద్యోగం చిన్నదా ..పెద్దదా.. ప్రభుత్వమా.. ప్రయివేట్దా అని ఆలోచించకుండా ఉద్యోగంలో చేరాలని సూచించారు.
ముఖ్యమంగా యువత సెల్ఫోన్కు బానిసలై జీవితాల్ని నాశనం సీజేసుకోవద్దని హరీశ్ రావు సూచించారు. ఇవాళ సెలక్ట్ కానివారికి నాక్ (చీaaస) ద్వారా శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశం కల్పిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ పేర్లను రిజిష్టర్ చేసుకోవాలన్నారు. యువత కొద్దిగా కష్ట పడితే మంచి అవకాశాలు వస్తాయని, పుట్టగానే ఎవరూ ఐశ్వర్య వంతులు కారన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Nov 18,2019 02:18PM