హైదరాబాద్: మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సాఫ్ట్వేర్ ఉద్యోగి రాజు కుమారుడు అర్జున్(7) కిడ్నాప్ ఉదంతాన్ని పోలీసులు మూడు గంటల్లోనే ఛేదించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వివరాలను రాచకొండ సీపీ మహేష్ భగవత్ మీడియాకు వివరించారు. నిన్న మూడు గంటల సమయంలో ఇంటి వద్ద ఆడుకుంటున్న అర్జున్ని 17 ఏళ్ల బాలుడు కిడ్నాప్ చేశాడు. అర్జున్ని కిడ్నాప్ చేసిన తర్వాత కిడ్నాపర్ 3 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు. 25 వేల నగదు... 2 లక్షల 75 వేల చెక్ ఇస్తే వదిలి పెడతానని చెప్పాడు. మీర్పేట్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి కిడ్నాపర్ బాలుడిని పట్టుకున్నారన్నారని సీపీ తెలిపారు. కిడ్నాప్నకు పాల్పడ్డ బాలుడు ఇదివరకే రాజు పక్కింట్లో లక్ష రూపాయల దొంగతనం చేసినట్టుగా పోలీసుల విచారణలో తేలింది. కిడ్నాపర్ బాలుడిని అరెస్ట్ చేసి జువైనల్ హోమ్కి తరలించినట్టు మహేష్ భగవత్ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm