హైదరాబాద్: హాంగ్కాంగ్లోని పాలిటెక్నిక్ యూనివర్సిటీలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్నది. నిరసన చేపడుతున్న విద్యార్థులపై పోలీసులు టియర్ గ్యాస్ను ప్రయోగించారు. వర్సిటీ నుంచి బయటకు వెళ్లాలనుకుంటున్న విద్యార్థులను వారు అడ్డుకుంటున్నారు. గత జూన్ నెల నుంచి హాంగ్కాంగ్లో నేరస్థుల అప్పగిత బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. అప్పగింత బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకున్నా.. హాంగ్కాంగ్ వర్సిటీలో మాత్రం ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. పోలీసుల వైఖరిని ఖండిస్తూ ఆ నిరసనలు జరుగుతున్నాయి. అయితే తాజాగా ఓ విద్యార్థిని పోలీసులు షూట్ చేయడంతో మరోసారి అక్కడ ఆందోళనలు మిన్నంటాయి. భారీ ఆయుధాలతో ఆదివారం విద్యార్థులు పోలీసులపై దాడికి దిగారు. పెట్రోల్ బాంబులు, బాణాలతో పోలీసుల్ని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దానిలో భాగంగా ఇవాళ ఉదయం వర్సిటీ వద్ద మళ్లీ ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది. విద్యార్థులు సిటీలోకి ఎంటర్ కాకుండా ఉండేందుకు పోలీసులు వారిని అడ్డుకున్నారు. ముఖానికి మాస్క్లు ధరించడాన్ని నిషేధిస్తూ ఇటీవల ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలను తప్పుపడుతూ కోర్టు తీర్పునిచ్చింది. సీసీకెమెరాల నుంచి తప్పించుకునేందుకు.. విద్యార్థులు మాస్క్లు వేసుకుని వర్సిటీ నుంచి పారిపోతున్నారు. అయితే వారిని గుర్తించేందుకు పోలీసులు ఆందోళనకారులపై దాడులు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm