హైదరాబాద్: ఆర్టీసీ ఇన్చార్జ్ ఎండీ సునీల్ శర్మపై గవర్నర్కు ఫిర్యాదు చేస్తామని తెలంగాణ టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. ఒక ఐఏఎస్ అధికారి ప్రతిపక్షాలపై ఆరోపణలు చేయడం ఏంటన్నారు. ప్రభుత్వాన్ని కూల్చాలంటే ఎమ్మెల్యేలు కావాలని, టీఆర్ఎస్ ప్రభుత్వమే ప్రతిపక్షాలను అస్థిరపరిచిందని అన్నారు. ఓ ఐఏఎస్ అధికారి రాజకీయ పార్టీలను దూషించటం దేశంలోనే తొలిసారి అని అన్నారు. సునీల్ శర్మ రాజభక్తి హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కనిపిస్తోందన్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వంలో జగన్కు సహకరించిన ఉన్నతాధికారుల పరిస్థితి ఏమైందో.. టీఆర్ఎస్ ప్రభుత్వానికి సహకరిస్తున్న ఏఐఎస్లు గుర్తుచేసుకోవాలని సూచించారు. రేపటి సడక్ బంద్కు టీటీడీపీ సంపూర్ణ మద్ధతు ఉంటుందని రావుల ప్రకటించారు.
Mon Jan 19, 2015 06:51 pm