హైదరాబాద్ : మొబైల్స్ తయారీదారు వివో తన నూతన స్మార్ట్ఫోన్ వై19ను భారత్లో ఇవాళ విడుదల చేసింది. రూ.13,990 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది. ఇందులో 6.53 ఇంచుల డిస్ప్లే, ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి65 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 16, 8, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ తదితర ఫీచర్లను అందిస్తున్నారు. కాగా ఈ ఫోన్ను హెచ్డీఎఫ్సీ లేదా ఐసీఐసీఐ బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం క్యాష్బ్యాక్ను అందిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm