హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై సోమవారం మధ్యాహ్నం హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం.. ఆర్టీసీ కార్మికుల సమ్మె చట్టవిరుద్దమని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను ఏజీ కోర్టుకు తెలిపారు. ఆర్టీసీ సమ్మె వల్ల పెద్ద మొత్తంలో నష్టపోయామని, ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోయిందని ఏజీ వాదనలు వినిపించారు. కార్మికులకు ముందు 44 శాతం ఫిట్మెంట్ ఇచ్చామని.. తర్వాత 16 శాతం ఇచ్చామని తెలిపారు. ప్రభుత్వం ఇంత చేసినా వారు సమ్మెకు వెళ్లారని ఏజీ పేర్కొన్నారు. హైకోర్టులో ఇంకా వాదనలు జరుగుతున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm