హైదరాబాద్: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేనిని ఎన్నో ఇబ్బందులు పెట్టారని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాలలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆయన కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పోలీసుల తీరు బాధాకరమన్నారు. తన పోరాటం పోలీసులపై కాదని, వైసీపీ పైనేనన్నారు. ఏ జిల్లా పర్యటనకు వెళ్ళినా పోలీసులు అలాగే ప్రవర్తిస్తున్నారన్నారు. రూ.43వేల కోట్ల అవినీతికి పాల్పడి తానేమీ కోర్టుకు వెళ్లడం లేదన్నారు. వైసీపీకి ఎందుకంత భయమని ప్రశ్నించారు.
Mon Jan 19, 2015 06:51 pm