ఢిల్లీ: ఏపీలో ఏబీఎన్, టీవీ5పై నిషేధాన్ని ఎత్తివేయాలని ఎంపీ గల్లా జయదేవ్ డిమాండ్ చేశారు. ఏపీలో ఓ ఎమ్మెల్యే అనుచరులు జర్నలిస్టును హత్య చేశారని తెలిపారు. మీడియా స్వేచ్ఛను అణగదొక్కేలా ఏపీ ప్రభుత్వం తెచ్చిన జీవోను లోక్సభలో జయదేవ్ ప్రస్తావించారు. ఏపీ ప్రభుత్వం తెచ్చిన జీవో విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. మీడియా సంస్థలపై కేసులు పెట్టేందుకు కార్యదర్శులకు అధికారం ఇచ్చారని, మంత్రులు, అధికారులకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే కేసులు పెట్టడం.. పత్రికా స్వేచ్ఛను హరించడమేనని జయదేవ్ చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm