న్యూఢిల్లీ: రాజ్యసభ 250వ సమావేశాల సందర్భంగా సభలో ప్రత్యేక చర్చ జరిపారు. ఈ సందర్భంగా ప్రసంగించిన రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. సభలోని సభ్యులు ఆత్మపరిశీలన చేసుకోవడానికి ఇది తగిన సమయం అని పేర్కొన్నారు. ఇప్పటి వరకు చేసిన పనులు గుర్తుచేసుకుని వెన్నుతట్టుకునే సమయం ఇది అన్నారు. అంతేకాదు.. రాజ్యసభ మెరుగ్గా పనిచేసేందుకు 10 సూచనలు చేశారు. 1952లో కొలువుదీరిన నాటి నుంచి రాజ్యసభ ఎన్నో చట్టాలు చేసిందని, లోక్సభ ఆమోదించిన బిల్లులకు రాజ్యసభ అడ్డంకి కారాదని అన్నారు. ఈ సందర్భంగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ రాసిన వ్యాసాన్ని సభలో వెంకయ్య నాయుడు ప్రస్తావించారు. 67 ఏళ్ల రాజ్యసభ ప్రయాణాన్ని సునిశితంగా పరిశీలించాలని, స్థాయీ సంఘాల సమావేశాలను తేలిగ్గా తీసుకోవద్దన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm