కరీంనగర్ : ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 45 వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేరిస్తేనే... సమ్మె విరమిస్తామని కార్మికులు స్పష్టం చేస్తున్నారు. కార్మికులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని ప్రభుత్వం కూడా అంతే పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు తమ నిరసనను తీవ్రతరం చేశారు. ఈ క్రమంలో... కరీంనగర్ జిల్లాకు చెందిన ఆర్టీసీ కార్మికులు... తెలంగాణ మంత్రులు తమ సమస్యలను పట్టించుకోకుండా సీఎం కేసీఆర్కు భజన చేస్తున్నారని ఆరోపిస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. సీఎం కేసీఆర్తో పాటు మంత్రుల ముఖాలతో కూడిన మాస్క్లు ధరించారు. మంత్రులంతా సీఎం కేసీఆర్కు భజన చేస్తున్నట్టుగా చిత్రీకరించారు.
Mon Jan 19, 2015 06:51 pm