హైదరాబాద్: నిజామాబాద్ జిల్లాలోని నందిపేట మండలం కౌల్పూర్ గ్రామంలోని ఎన్టీఆర్ కాలనీలో అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో జరిగిన ప్రమాదంలో బత్తుల ప్రసాద్కు చెందిన ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. మూడు లక్షల రూపాయల నగదు, ఐదు తులాల బంగారం, ఇంట్లో టీవీ ఫర్నీచర్, బట్టలు పూర్తిగా కాలిపోయాయి. గ్రామస్తులు, అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పే లోపు భారీగా ఆస్తినష్టం జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm