న్యూఢిల్లీ : మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సంచనల వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి పోటీ చేశాయని, ఎవరు ఎటు వెళ్తారో వారే తేల్చుకోవాలని సవాల్ విసిరారు. 'ఎన్నికల సమయంలో బీజేపీ, శివసేన కలిసి పోటీచేశాయి. మరోవైపు ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి పోటీశాయి. ఎవరెటు వెళ్తారో వారే నిర్ణయించుకోవాలి. మా రాజకీయాలు మేము చేసుకుంటాం' అని స్పష్టం చేశారు. దీంతో ఒక్కసారిగా మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం చెలరేగింది. మహారాష్ట్ర తాజా రాజకీయాలపై విలేకరులు పార్లమెంటులో శరద్ పవార్ను అడగ్గా, పై విధంగా స్పందించారు.
Mon Jan 19, 2015 06:51 pm