తిరుమల: ఏపీ ప్రభుత్వం దూకుడు తగ్గించుకుని ప్రజలకు మేలు చేసేలా పాలన సాగించాలని టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ సూచించారు. సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయ నాయకులు పరుష పదజాలం వాడటం బాధాకరమని అన్నారు. దుర్భాషలాడడం ద్వారా ఎవరూ హీరోలు కారని ఆయన వ్యాఖ్యానించారు. అందరినీ ప్రజలు గమనిస్తున్నారని, నాయకులు హుందాగా వ్యవహరించాలన్నారు. కొంతమంది నాయకులు మీడియాను వేదికగా చేసుకుని పరుష పదజాలంతో మాట్లాడుతున్నారని.. అలా అన్ని పార్టీల్లో ఉన్నారని అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm