హైదరాబాద్: కొత్తగా 207 వ్యవసాయ మార్కెట్ యార్డులు వస్తున్నాయని మంత్రి కన్నబాబు అన్నారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో మార్కెట్ కమిటీ ఏర్పాటుకు సీఎం ఆదేశించారన్నారు. మార్కెట్ యార్డులకూ నాడు-నేడు పథకం వర్తింపజేయాలని నిర్ణయించారన్నారు. బయో పెస్టిసైడ్స్ నియంత్రణకు బయో ప్రోడక్ట్స్ కంట్రోల్ చట్టం తెస్తామన్నారు. బయో ప్రోడక్ట్స్లను పరీక్షించాకే రైతులకు అందించాలని సీఎం ఆదేశించారని మంత్రి పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm