హైదరాబాద్ : భారతదేశవ్యాప్తంగా పలుప్రాంతాల్లో యువతులు, మహిళలపై జరుగుతున్న లైంగికదాడి, హత్య ఘటనల పట్ల అట్లాంటాలోని తెలుగు ఎన్నారైలు ఆందోళన, దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఇటీవల హైదరాబాద్ షాద్నగర్ సమీపంలో జరిగిన దిశ హత్యోదంతాన్ని నిరసిస్తూ తెలుగు ఎన్నారైలు అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరఫున స్థానిక రెస్టారెంట్లో కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. కార్యక్రమానికి హాజరైన మహిళలు, రెండు నిమిషాలపాటు మౌనం పాటించి దిశకు నివాళులు అర్పించారు.
Mon Jan 19, 2015 06:51 pm