అమరావతి: కృష్ణా జిల్లా నందిగామ సమీపంలోని అంబారుపేట వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నది. ఆగి ఉన్న డీసీఎంను కారు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో నలుగురు యువకులు మృతిచెందారు. నందిగామ విజయ టాకీస్ ప్రాంతానికి చెందిన అనీల్, సాయి, మనోజ్, దుర్గా, అరవింద్ కారులో విజయవాడకు బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు అంబారుపేటకు చేరుకోగానే అతివేగంతో ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు ఘటనా స్థలంలోనే మృతిచెందగా, తీవ్రంగా గాయపడిన ఇద్దరిని దవాఖానకు తరలిస్తుండగా ఒకరు మార్గంమధ్యలోనే మరణించారు. మృతులను దుర్గా, మనోజ్, అరవింద్, అనీల్గా గుర్తించారు. అతివేగంగా, సెల్ఫోన్ మాట్లాడుతూ కారు నడుపడమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm