కడప: జిల్లాలోని రైల్వేకోడూరు మండలం రఘవరాజపురం గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కారును గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. బాధితులు రంగారెడ్డి జిల్లా కంకల్ వాసులుగా గుర్తించారు. కంకల్ నుంచి కారులో తిరుపతి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
Mon Jan 19, 2015 06:51 pm