రాజ్కోట్: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో వన్డే ఉత్కంఠగా సాగుతోంది. 38వ ఓవర్ వరకు విజయం వైపు దూసుకెళ్తున్నట్టు కనిపించిన ఆసీస్ను ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి కుల్దీప్ దెబ్బకొట్టగా, ఆ తర్వాత 44వ ఓవర్ తొలి రెండు బంతుల్లోనూ వికెట్లు పడగొట్టిన షమీ భారత్ను విజయం వైపు మళ్లించాడు. వరుస బంతుల్లో ఆష్టన్ టర్నర్ (13), పాట్ కమిన్స్ (0)లను పెవిలియన్ పంపాడు. దీంతో ఒక్కసారిగా మ్యాచ్ భారత్ చేతుల్లోకి వచ్చేసింది. ప్రస్తుతం 46 ఓవర్లు పూర్తయ్యాయి. ఆసీస్ ఏడు వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 24 బంతుల్లో 67 పరుగులు అవసరం కాగా, చేతిలో మూడు వికెట్లు ఉన్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm