హైదరాబాద్: రాష్ట్ర పోలీస్శాఖను ప్రతిష్టాత్మకమైన సీఎస్ఐ అవార్డు వరించింది. ప్రముఖ సంస్థ కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర పోలీస్శాఖకు 2019 ఇ-గవర్నెన్స్ ఎక్సలెన్సీ అవార్డును ప్రకటించింది. రాష్ట్రంలో మహిళలు, పిల్లల భద్రతకు పోలీస్శాఖ రూపొందించిన హాక్-ఐ యాప్ను ప్యాసింజర్ క్యాబ్ సర్వీసులైన ఓలా, ఊబెర్ తదితర ప్రైవేటు క్యాబ్ సర్వీసుల మొబైల్ యాప్లకు అనుసంధానం చేయడం ద్వారా మహిళల భద్రతకు చేపట్టిన విధానానికి ఈ అవార్డు లభించింది. ఒరిస్సాలోని భువనేశ్వర్లో శుక్రవారం జరిగిన ప్రత్యేక సమావేశంలో డీజీపీ కార్యాలయం ప్రతినిధి, ఐటీ విభాగం డీఎస్పీ కే.వెంకట్రెడ్డికి ఒరిస్సా రాష్ట్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ, క్రీడాశాఖ మంత్రి తుషార్ కాంతి బెహ్రా చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. హాక్-ఐ మొబైల్యాప్ నిర్వహణను సీఎస్ఐ ప్రశంసించింది. అవార్డు రావడం పట్ల డీజీపీ మహేందర్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm