హైదరాబాద్ : దిశ హత్యాచార నిందితుల ఎన్కౌంటర్పై నియమించిన కమిటీకి సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ప్రకటించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కమిటీ అనుసరించాల్సిన విధివిధానాలను వెల్లడించింది. హత్యాచారం చేసిన నిందితులను సైబరాబాద్ పోలీసులు ఎన్కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. ఎన్కౌంటర్పై పలు అనుమానాలు వ్యక్తమవడంతో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి.ఎస్.సిర్పూర్కర్ నేతృత్వంలో గత ఏడాది డిసెంబర్ 12న కమిటీని ఏర్పాటు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. నలుగురు నిందితుల మరణానికి దారి తీసిన పరిస్థితులపై ఈ కమిటీ విచారించనుంది. నేరం జరిగిందని తేలితే తప్పు చేసిన అధికారులను బాధ్యులను చేయాల్సిందిగా న్యాయస్థానం పేర్కొంది. ఆరు నెలల్లోగా విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని అత్యున్నత న్యాయస్థానం కమిటీని ఆదేశించింది.
Mon Jan 19, 2015 06:51 pm