హైదరాబాద్: అజయ్ దేవగన్ నటించిన తానాజీ సినిమా.. బాక్సాఫీసు వద్ద దూసుకువెళ్తున్నది. ఇప్పటికే ఆ సినిమా 128 కోట్లు వసూల్ చేసింది. తర్వలోనే 200 కోట్ల మైలురాయిని దాటనున్నది. ప్రస్తుతం సినీ ప్రేక్షకులంతా తానాజీ కోసం ఎగబడుతున్నారని ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్లో తెలిపారు. సినిమా రిలీజై వారం అయిన సందర్భంగా.. తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. సగటును ప్రతి రోజు తానాజీ సినిమా 13 కోట్లు వసూల్ చేసినట్లు అంచనా వేశారు. ఒకవేళ ఇదే రిథమ్లో వెళ్తే ఆ సినిమా 200 కోట్లు ఆర్జించిడం ఖాయమే అని ఆదర్శ్ తెలిపారు. మహారాష్ట్రలో తానాజీ మూవీకి ఆదరణ బాగా ఉందన్నారు. వంద కోట్లు ఆర్జించిన సందర్భంగా అజయ్ దేవగన్.. చిత్ర బృందంతో సంబరాలు జరుపుకున్నారు. ఓమ్ రౌత్ ఈ సినిమాకు డైరక్షన్ వహించారు. ఛత్రపతి శివాజీ వద్ద కమాండర్గా ఉన్న తానాజీ జీవితకథ ఆధారంగా ఈ సినిమాను తీశారు. ఉదయ్ భాన్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించాడు.
Mon Jan 19, 2015 06:51 pm