హైదరాబాద్ : తెలంగాణ వచ్చాక చేర్యాల అనాథగా మారిపోయిందని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాలలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఎంపీ పాల్గొని ప్రచారం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పోరాటాల చరిత్ర ఉన్న చేర్యాలను టీఆర్ఎస్ అణామకం చేసిందన్నారు. ఉద్యోగులకు ఐఆర్ ఇవ్వకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. లక్షన్నర ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm