అమరావతి: మందడం, తుళ్లూరు గ్రామాలకు చెందిన రైతులు, స్థానికులకు పోలీసు డిపార్టుమెంట్ నుంచి నోటీసులు అందాయి. సెక్షన్ 149 సీఆర్పీసీ ప్రకారం ఈ నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. ఈ నెల 20న అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున పలుపార్టీలు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో శాంతిభద్రతలకు భంగం కలగకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా నిరసనలు చేపట్టాలని రాజధాని ప్రాంత గ్రామస్థులకు పోలీసులు సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm