శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో పాక్ ఆర్మీ కాల్పులకు పాల్పడింది. పాక్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. రాష్ట్రంలోని పూంచ్ జిల్లాలో ఉన్న మాందాహార్ సెక్టార్లో పాక్ ఆర్మీ 45 నిమిషాల పాటు కాల్పులకు పాల్పడింది. ఆ సమయంలో భారత భద్రతా దళాలు వారికి ధీటుగా స్పందిస్తూ కాల్పులు జరిపాయి.
Mon Jan 19, 2015 06:51 pm