హైదరాబాద్ : తూర్పుగోదావరి జిల్లా తుని మండలం డి.పోలవరం గ్రామంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. చల్లపల్లి అప్పారావు ( 40) అనే వ్యక్తిని అతి దుండగులు దారుణంగా హత్య చేసి బస్సు షెల్టర్ లో పడవేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కల్వచర్ల గ్రామానికి చెందిన చల్లపల్లి అప్పారావు సంక్రాంతి పండుగ కని అత్తవారింటికి డి.పోలవరం గ్రామానికి వచ్చాడు. అప్పారావు తలపై అతి దారుణంగా కత్తితో నరికిన గాట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తుని రూరల్ పోలీసులు అనుమానాస్పద స్థితి మృతి కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే అప్పారావు కుటుంబ సభ్యులు మాత్రం హత్య చేసి బస్ షెల్టర్ లో పడేశారని ఆరోపిస్తున్నారు. ఈ సంఘటన గ్రామంలో సంచలనం రేకెత్తించింది.
Mon Jan 19, 2015 06:51 pm