కోల్కత్తా : పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలన్ని ఒకే వేదికపైకి రావాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిదంబరం అన్నారు. కోల్కత్తాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్ఆర్పీకి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి పార్టీలన్నీ ఒకే వేదికపైకి రావాలని తాను కోరుకుంటున్నట్టు తెలిపారు. అప్పుడే కేంద్ర ప్రభుత్వం దిగివస్తుందని అన్నారు.