హైదరాబాద్: బాలీవుడ్ సీనియర్ నటి షబానా అజ్మీ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ముంబై-పూణె ఎక్స్ ప్రెస్ వేపై నిన్న మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ట్రక్కును వెనుకవైపు నుంచి వీరి కారు గుద్దుకుంది. ఈ ప్రమాదంలో షబానా అజ్మీ గాయాలపాలయ్యారు. ఇదే వాహనంలో ప్రయాణిస్తున్న ఆమె భర్త, బాలీవుడ్ గీత రచయిత జావెద్ అఖ్తర్ మాత్రం చిన్న గాయాలతో బయటపడ్డారు. మరోవైపు, కారు డ్రైవర్ యోగేంద్ర కామత్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, ట్రక్కు డ్రైవర్ రాజేశ్ పాండురంగ్ షిండే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు. కారు డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ వల్లే ప్రమాదం జరిగిందని ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm