మెదక్: జిల్లాలోని నర్సాపూర్ మండలం అవంచ గ్రామ శివారులో దారుణ సంఘటన చోటు చేసుకుంది. మహిళపై అత్యాచారం చేసిన గుర్తు తెలియని దుండగులు మెడకు చీరతో ఉరివేసి హత్య చేశారు. పొలం పనులకు వెళ్లిన రైతులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు హత్నూర్ మండలం దేవులపల్లి గ్రామానికి చెందిన మన్నె అనసూయ(45)గా గుర్తించారు.
Mon Jan 19, 2015 06:51 pm