హైదరాబాద్ : బెంగళూరు వెదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. ఏడు వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించి సిరీస్ను సోంతం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఆసీస్ నిర్ణిత 50 ఓవర్లకు తొమ్మిది వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాట్స్ మెన్లలో స్మిత్ 131, లబుషేన్ 54, క్యారీ 35 పరుగులు చేశారు. భారత బౌలర్లలో షమి 4, జడేజా 2 వికెట్లు తీయగా కుల్దీప్, సైనీ చెరో వికెట్ తీశారు. ఇక 287పరుగుల లక్ష్యంతో భరిలోకి దిగిన భారత్ ఓపెనర్లు రాహుల్ (19) రోహిత్ శర్మ (119) అద్భుత సెంచరీ కోహ్లీ (89) అయ్యర్ (44) పరుగులు చేయడంతో 47.3 ఓవర్లలోనే 289 పరుగులు చేసి ఘన విజయం సాధించింది.
Mon Jan 19, 2015 06:51 pm