హైదరాబాద్: మంత్రి కేటీఆర్ ఆస్తులపై సీఎం కేసీఆర్కు కాంగ్రెస్ నేత రేవంత్ లేఖ రాయడం మంచిదేనని ఆ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు అన్నారు. కేటీఆర్ ఆస్తులపై కేసీఆర్ విచారణ జరిపిస్తారనేది అనుమానమేనని సందేహం వ్యక్తం చేశారు. రేవంత్ రాంగ్ పర్సన్కు లేఖ రాశారని, కేటీఆర్ ఆస్తులపై కేంద్రమంత్రి అమిత్షాకు లేఖ రాయాల్సిందని చెప్పారు. దీంతో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య సంబంధాలు కూడా బయటపడేవని వీహెచ్ అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm