బ్లూమ్ ఫోంటీన్: అండర్ 19 ప్రపంచకప్లో భారత్ శుభారంభం చేసింది. శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో లంక 207 పరుగులకే ఆలౌటైంది. నిపున్ (50) అర్ధశతకం చేసినా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. కమిల్ (39), రవీందు (49) ఫర్వాలేదనిపించారు. లంక బ్యాట్స్మెన్లో నవోద్ 6, తవీషా 15, సోనల్ 16, కవిందు 4, డానియల్ డకౌట్, డిసిల్వా 5, దిల్షాన్ 4 పరుగులు చేశారు. భారత బౌలర్లలో ఆకాశ్ సింగ్, వీర్, రవి తలో 2 వికెట్లు.. త్యాగి, మిశ్రా, జైశ్వాల్ ఒక్కో వికెట్ తీశారు.
Mon Jan 19, 2015 06:51 pm