హైదరాబాద్: స్వచ్ఛ సర్వేక్షణ్-2020లో భాగంగా ఢిల్లీ బృందం ఈవాళ నగరంలోని అంబర్పేట సర్కిల్లో పర్యటించనున్నది. గార్బేస్ ఫ్రీ సిటీస్ పేరుతో ఈ ఏడాది స్వచ్ఛ సర్వేక్షణ్ను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నగరంలోని 150 డివిజన్లలలో ఈ బృందం పర్యటించనున్నది. ఈ నేపథ్యంలో అంబర్పేట సర్కిల్లో డీసీ వేణుగోపాల్, ఏఎంఓహెచ్ డాక్టర్ హేమలతల నేతృత్వంలో పారిశుధ్య కార్మికులు గత కొన్ని రోజులుగా బస్తీలు, కాలనీల్లో చెత్తాచెదారం, వ్యర్థాలు లేకుండా శుభ్రం చేస్తున్నారు. డంపింగ్ పాయింట్లలో చెత్త వేయకుండా ముగ్గులు వేశారు.
Mon Jan 19, 2015 06:51 pm