ఉత్తరప్రదేశ్: రాత్రివేళ వీధుల్లో వ్యానులో తిరుగుతూ పెట్రోలింగ్ చేస్తున్న పోలీసుకానిస్టేబులే పాలప్యాకెట్లను చోరీ చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడా నగరంలో వెలుగుచూసింది. నోయిడా నగరంలోని ఓ స్టోరు వద్ద ఆరుబయట తెల్లవారుజామున పాలప్యాకెట్లను ట్రేలలో ఉంచారు. పోలీసు వ్యానులో తిరుగుతూ పెట్రోలింగ్ డ్యూటీ చేస్తున్న ఓ పోలీసు కానిస్టేబుల్ కిందకు దిగి రెండు పాలప్యాకెట్లను చోరీ చేశాడు. చోరీ చేసిన పాల ప్యాకెట్లను పోలీసు వ్యానులో కూర్చున్న మరో కానిస్టేబుల్కు అందించాడు. ఈ ఘటన సీసీటీవీ ఫుటేజ్లో రికార్డు అయింది. పోలీసుకానిస్టేబుల్ పాలప్యాకెట్లను దొంగతనం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్ అయింది. నోయిడా పోలీసు ఉన్నతాధికారులు పాలప్యాకెట్ల పోలీసు దొంగ గురించి ఆరా తీస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm