హైదరాబాద్ : అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుపై ఏపీ శాసన మండలి సమావేశాలు ఉత్కంఠగా సాగుతున్న వేళ.. వాటిని తిలకించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఇతర నేతలు వెళ్లారు. బాలకృష్ణను అక్కడ చూడగానే వైసీపీ ఎమ్మెల్యేలు ఆయనతో సెల్ఫీల కోసం పోటీపడ్డారు. రోజా, కాసు మహేశ్రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి, అబ్బయ్య చౌదరి, వసంత కృష్ణప్రసాద్ తదితరులు బాలకృష్ణతో సెల్ఫీ దిగారు. ఆ తర్వాత కాసేపు సరదాగా ముచ్చటించారు. బాలయ్యతో సెల్ఫీలకు పోటీ పడడంతో మండలిలో ఒక్కసారిగా సందడి నెలకొంది.
Mon Jan 19, 2015 06:51 pm